మంగళసూత్రం లేదా మాంగళ్యం హిందూ సాంప్రదాయంలో పెళ్ళి జరిగిన స్త్రీలు మెడలో ధరించే గొలుసు లాంటి వస్తువు. దీనిలో తాళి లేదా తాళిబొట్టు, కొన్ని నల్ల పూసలు మొదలైనవి గుచ్చుకుంటారు.
వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్ధంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో ‘మంగళ’ అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు కలవు. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు కలవు. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్రధారణ జరుగునపుడు ఈ మంత్రమును పఠిస్తారు.
“ మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!! ”
మంగళ సూత్రము భార్యా భర్తల శాశ్వత నుభంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడులనుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం.శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రము ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని హిందువులు నమ్ముతారు. అందుకే హిందూ స్తీ మంగళ సూత్రము ధరించును. వివాహిత మెడలో మంగళ సూత్రము లేదంటే భర్త చనిపోయినట్లుగా భావించవచ్చును.
చరిత్ర
పూర్వం మానవ సమాజంలో ఎటువంటి ఆచారాలు, సంప్రదాయాలు ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి. భారతావనికి కిరాత వంటి జాతులవారు వలసవచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకొనిపోయేవారు. పురుషులు శత్రువులతో పోరాడి తమ స్త్రీలను విడిపించుకొనేవారు. కాలక్రమేణా తమ స్త్రీలకు తాయెత్తులాంటివి లేదా త్రాడులాంటివి కట్టసాగారు. ‘నేను ఈ స్త్రీకి త్రాడు కట్టాను, కనుక ఈ స్త్రీ నాది, ఈ స్త్రీని ముట్టుకుంటే చంపేస్తా’ అన్నట్లుగా పరాయి తెగ వారికి హెచ్చరికలు చేసేవారు. త్రాడు కట్టబడిన స్త్రీలను ముట్టుకోవడానికి పరాయితెగ పురుషులు భయపడేవారు. పైపెచ్చు త్రాడు కట్టబడిన స్త్రీలను గౌరవించేవారు. కాలక్రమేణా 6 వ శతాబ్దానికి ఆ త్రాడే మంగళ సూత్రంగా మారిందని చరిత్ర చెబుతోంది. సుమారు 2000 సంవత్సరాల క్రితం ఆదిశంకరాచార్యుల వారు తను వ్రాసిన సౌందర్యలహరి అను పుస్తకములో మంగళ సూత్రానికి విశిష్టత కల్పించారు.
చరిత్ర
పూర్వం మానవ సమాజంలో ఎటువంటి ఆచారాలు, సంప్రదాయాలు ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి. భారతావనికి కిరాత వంటి జాతులవారు వలసవచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకొనిపోయేవారు. పురుషులు శత్రువులతో పోరాడి తమ స్త్రీలను విడిపించుకొనేవారు. కాలక్రమేణా తమ స్త్రీలకు తాయెత్తులాంటివి లేదా త్రాడులాంటివి కట్టసాగారు. ‘నేను ఈ స్త్రీకి త్రాడు కట్టాను, కనుక ఈ స్త్రీ నాది, ఈ స్త్రీని ముట్టుకుంటే చంపేస్తా’ అన్నట్లుగా పరాయి తెగ వారికి హెచ్చరికలు చేసేవారు. త్రాడు కట్టబడిన స్త్రీలను ముట్టుకోవడానికి పరాయితెగ పురుషులు భయపడేవారు. పైపెచ్చు త్రాడు కట్టబడిన స్త్రీలను గౌరవించేవారు. కాలక్రమేణా 6 వ శతాబ్దానికి ఆ త్రాడే మంగళ సూత్రంగా మారిందని చరిత్ర చెబుతోంది. సుమారు 2000 సంవత్సరాల క్రితం ఆదిశంకరాచార్యుల వారు తను వ్రాసిన సౌందర్యలహరి అను పుస్తకములో మంగళ సూత్రానికి విశిష్టత కల్పించారు.