ఇంట్లో ఎక్కువసేపు తడిలో తిరుగుతూ పనిచేయడం వల్ల అమ్మల పాదాలు పగలడం చూస్తుంటాం. దీనికి తోడు ఎండవేడి కూడా తోడవడంతో పగుళ్ల బాధలు మరింత ఎక్కువవుతాయి. అందుకే ఇంట్లోని వస్తువులతో పాదాలు ఆరోగ్యంగా, అందంగా ఉండేలా, పాదాల పగుళ్లు తగ్గేలా చేసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాం..
మింట్ టీ ఫుట్ సోక్ : గోరు వెచ్చటి నీళ్లల్లో ఒక టేబుల్ స్పూన్ తేనె, రెండు మింట్ (పుదీనా) టీ బ్యాగ్స్, ఎసెన్షియల్ ఆయిల్ కొన్ని చుక్కలు వేసి బాగా కలిపి అందులో పాదాలు ముంచి 15 నుంచి 20 నిమిషాలపాటు ఉంచాలి. ఇలా చేస్తే పాదాలు మెరుస్తాయి.
ఆయిల్, ఓట్మీల్ ఫుట్ స్క్రబ్ : పాడైన చర్మాన్ని తొలగించడంలో ఫుట్ స్క్రబ్ ఎంతో బాగా పనిచేస్తుంది. దీన్ని నెలకు రెండుసార్లు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ స్క్రబ్ తయారుచేయడం చాలా సులభం . కొబ్బరినూనె లేదా బాదం నూనె తీసుకుని అందులో ఓట్మీల్ను వేసి బాగా మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకుని చేత్తో పది నిమిషాలపాటు మసాజ్ చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. ఈ స్క్రబ్ను ముఖానికి కూడా వేసుకోవచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్లు మటుకు ఈ స్క్రబ్ను వాడకూడదు. ఈ స్క్రబ్ను అప్లై చేసే ముందు సెన్సిటివ్ ఏరియాస్లో ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.
లెమన్, పెట్రోలియం జెల్లీ మసాజ్: పగిలిన పాదాలను నిమ్మకాయ పిండిన గోరువెచ్చటి నీళ్లల్లో 15 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత వాసెలైన్ లాంటి పెట్రోలియం జెల్లీలో కొద్దిగా నిమ్మరసం కలిపి దానితో పాదాలను మసాజ్ చేయాలి. దీన్ని రాత్రిపూట చేసుకోవాలి. మసాజ్ అనంతరం పాదాలకు సాక్స్ వేసుకోవడం మరవొద్దు.
బనానా, ఆలివ్ ఆయిల్ ఫ్రూట్ ప్యాక్: పాదాలు అందంగా, ఆరోగ్యంగా కనిపించడానికి ఈ ఫ్రూట్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. అరటిపళ్ల గుజ్జును, ఆలివ్ ఆయిల్ను బాగా కలిపి పేస్టులా చేయాలి. గుజ్జు తక్కువగా ఉండి ఆయిల్ ఎక్కువగా ఉండాలి. ఆ పేస్టుతో పాదాలను సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత అరగంటసేపు పాదాలను అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో పాదాలను కడుక్కోవాలి. అరటిపండు వాసన రాకూడదనుకుంటే సబ్బుతో పాదాలను శుభ్రంగా కడుక్కోవచ్చు. ఇలా చేస్తే పాదాలు మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటాయి
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.