వినాయకుని పూజ ఏ విధంగా చేస్తే ఎటువంటి దోషం పోతుంది?



నవరాత్రుల సమయంలో గణనాధుని విగ్రహాలు వేల సంఖ్యల్లో వివిధ ఆకారాల్లో దర్శనమిస్తాయి. వివిధ రకాల దోషాలు, వివిధ పద్ధతిలో తయారు చేయబడిన గణపతిని పూజించటం వల్ల పోగొట్టుకోవచ్చు.

• సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి.



• చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి.


• కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది.


• బుధ దోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి.


• గురు దోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి.


• శుక్ర దోష నివారణకు స్ఫటిక గణపతికి ఆరాధన చేయాలి.


• దోష నివారణకు నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజించాలి.


• రాహు గ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పుజిస్తే ఫలితం ఉంటుంది.


• కేతు గ్రహ దోష నివారణకు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి.


• అనారోగ్య సమస్యలు తొలగడానికి ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి.


• అప్పుల బాధలు తొలగిపోవడానికి పగడపు గణపతిని పూజించాలి.


• మానసిక ప్రశాంతత కొరకు పాలరాయితో చేసిన గణపతిని పూజించాలి.


• అన్ని సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి.


• సుఖశాంతుల కొరకు స్ఫటిక గణపతిని పూజించాలి.

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.