రక్తవృద్ధికి తిరుగులేని శక్తివంతం అయిన యోగం

ప్రస్తుత పరిస్థితులలో చాలామంది శరీరం లో రక్తం తక్కువ ఉండి రక్తహీనత తో బాధపడుతున్నారు. శరీరం తెల్లగా పాలిపోవడం ఉబ్బినట్టు ఉండటం . శక్తిహీనంగా తమపనులు కూడా తాము చేసుకోలేని స్థితిలో ఉంటున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ శక్తివంతం అయిన ఔషధం రక్తహీనత పైన వజ్రాయుధంలా పనిచేస్తుంది

ఎండుఖర్జురాల ముక్కలు , సీమ బాదం పప్పు ముక్కలు, ఎండు ద్రాక్ష పండ్లు ( కిస్మిస్ ) , పటికబెల్లం వీటిని సమానంగా తీసుకుని ఒక పాత్రలో వేసి అవి మునిగేవరకు మంచి తేనే పోసి పైన మూత పెట్టి గాలి లొపలికి చొరబడకుండా గట్టిగా కట్టి 21 రోజుల పాటు కదిలించకుండా ఉంచాలి. ఆ తరువాత ఆ పదార్థాన్ని వేరే గాజు పాత్రలోకి మార్చుకొని పూటకు పది గ్రాములు అనగా రెండు టీస్పూన్ల మోతాదుగా ఆహారానికి గంట ముందుగా తింటూ ఉంటే శరీరానికి అమితమైన శక్తి , రక్తవృద్ధి కలుగుతాయి..

శక్తిలేక కృశించి ఉండు పిల్లలు మరియు పెద్దవారు ఈ ఓషదాన్ని తీసుకొవడం వలన అమిత బలసంపన్నులు అవుతారు. ఆపరేషన్ చెయించుకున్న వారు తొందరగా కోలుకోవడానికి ఈ ఔషదం ఉపయోగపడును.

గమనిక - పైన చెప్పిన పదార్దాలు అన్ని సమాన స్థాయిలో తీసుకోవలెను. తెనే స్వచ్ఛమైనది మాత్రమే వాడవలెను.

************* కాళహస్తి వెంకటేశ్వరరావు *************

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.